నిన్న అచ్యుతాపురంలో ఫార్మా సెజ్ లో జరిగిన ప్రమాద ఘటన పైన జిల్లా కలెక్టర్ స్పందించారు. ప్రమాదం లో చనిపోయిన వారికీ ప్రభుత్వం తరుపున కోటి రూపాయాలు సహాయాన్ని ఆయన ప్రకటించారు. నిన్న అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి 18మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన పైన స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారికీ ఒక్కొక్కరి చొప్పున కోటి రూపాయలు సహాయాన్ని ప్రకటించారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు మరియు గాయపడిన వారికి 50 వేల రూపాయలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
