Hyderabad: హైదరాబాద్‌లో ఈరోజు ఓపీ సేవల నిలిపివేత

Hyderabad: హైదరాబాద్‌లో ఈరోజు ఓపీ సేవల నిలిపివేత

హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను ఈరోజు నిలిపివేసినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. కోల్‌కతాలో పీజీ వైద్యురాలి హత్యాచారంకు నిరసనగా హైదరాబాద్‌ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ రోజు ఉదయం నుండి రేపటి వరకు ఆరు గంటల పాటు ఓపీ సేవను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయివేటు ఆసుపత్రుల చరిత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలకు బంద్ ను ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 

Heavy traffic jam on Hyderabad-Vijayawada National Highway
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్

పీజీ వైద్యురాలి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేయనున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు అందరు కలిసి ధర్నా చౌక్ లో నిరసన చేయనున్నారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు నిర్వహిస్తాము అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.

హైదరాబాద్ సాహసికురాలు అంజని ఎల్బ్రస్ పర్వతాన్ని జయించారు
హైదరాబాద్ సాహసికురాలు అంజని ఎల్బ్రస్ పర్వతాన్ని జయించారు
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *